భగవద్గీత -- అథ త్రయోదశోஉధ్యాయః --క్షేత్రక్షేత్రఙ్ఞవిభాగయోగో నామ --- 21 నుండి 34 వరకు శ్లోకాలు
కార్యకారణకర్తృత్వే హేతుః ప్రకృతిరుచ్యతే|
పురుషః సుఖదుఃఖానాం భోక్తృత్వే హేతురుచ్యతే||
భావం
పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు. ఈ గుణసాంగత్యము వలన జీవాత్మయొక్క నీచోన్నత జన్మలు కలుగుచున్నవి.
పురుషుడు ప్రకృతిస్థుడై ప్రకృతినుండి ఉత్పన్నములైన త్రిగుణాత్మక పదార్థములను అనుభవించుచు. ఈ గుణసాంగత్యము వలన జీవాత్మయొక్క నీచోన్నత జన్మలు కలుగుచున్నవి.
22 వ శ్లోకం
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు||
పురుషః ప్రకృతిస్థో హి భుఙ్క్తే ప్రకృతిజాన్గుణాన్|
కారణం గుణసఙ్గోऽస్య సదసద్యోనిజన్మసు||
భావం
ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే, అతడు సాక్షిభూతుడగుటవలన ఉపద్రష్టయనియు, యథార్థసమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన మహేశ్వరుడు అనియు, పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు.
ఈ దేహమునందున్న ఆత్మ వాస్తవముగా పరమాత్మయే, అతడు సాక్షిభూతుడగుటవలన ఉపద్రష్టయనియు, యథార్థసమ్మతినిచ్చువాడగుట వలన అనుమంత అనియు, అన్నింటిని ధరించి, పోషించువాడు అగుటవలన భర్త అనియు, జీవరూపములో భోక్త అనియు, బ్రహ్మాదులకును స్వామి యగుటవలన మహేశ్వరుడు అనియు, పరమాత్మ అనియు చెప్పబడుచున్నాడు.
23 వ శ్లోకం
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః||
ఉపద్రష్టానుమన్తా చ భర్తా భోక్తా మహేశ్వరః|
పరమాత్మేతి చాప్యుక్తో దేహేऽస్మిన్పురుషః పరః||
భావం
ఈ విధముగా పురుషునితత్త్వమును, గుణసహితమైన ప్రకృతితత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్యకర్మలను ఆచరించుచున్నప్పటికిని తిరిగి జన్మించడు.
ఈ విధముగా పురుషునితత్త్వమును, గుణసహితమైన ప్రకృతితత్త్వమును తెలిసికొనినవాడు అన్ని విధములగు కర్తవ్యకర్మలను ఆచరించుచున్నప్పటికిని తిరిగి జన్మించడు.
24 వ శ్లోకం
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే||
య ఏవం వేత్తి పురుషం ప్రకృతిం చ గుణైః సహ|
సర్వథా వర్తమానోऽపి న స భూయోऽభిజాయతే||
భావం
కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగముద్వారా తమహృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞాన యోగముద్వారాను, మరికొందరు కర్మయోగముచేతను ఆ పరమాత్మను దర్శింతురు.
కొందరు ఈ పరమాత్మను శుద్ధమైన సూక్ష్మబుద్ధితో ధ్యానయోగముద్వారా తమహృదయములయందు చూతురు. మరికొందరు జ్ఞాన యోగముద్వారాను, మరికొందరు కర్మయోగముచేతను ఆ పరమాత్మను దర్శింతురు.
25 వ శ్లోకం
ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే||
ధ్యానేనాత్మని పశ్యన్తి కేచిదాత్మానమాత్మనా|
అన్యే సాఙ్ఖ్యేన యోగేన కర్మయోగేన చాపరే||
భావం
కాని ఈ సాధనమార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగ ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యువును దాటుచున్నారు.
కాని ఈ సాధనమార్గములను గూర్చి ఎరుగని మందబుద్ధులు తత్త్వజ్ఞానముగల ఇతరులనుండి విని, తదనుసారముగ ఉపాసనలు చేయుదురు. ఆ శ్రవణపరాయణులును మృత్యువును దాటుచున్నారు.
26 వ శ్లోకం
అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|
తేऽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః||
అన్యే త్వేవమజానన్తః శ్రుత్వాన్యేభ్య ఉపాసతే|
తేऽపి చాతితరన్త్యేవ మృత్యుం శ్రుతిపరాయణాః||
భావం
ఓ అర్జునా ! ఆ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర - క్షేత్రజ్ఞ సంయోగము వలననే కలుగుచున్నవని గ్రహించుము.
ఓ అర్జునా ! ఆ స్థావరజంగమప్రాణులన్నియును క్షేత్ర - క్షేత్రజ్ఞ సంయోగము వలననే కలుగుచున్నవని గ్రహించుము.
27 వ శ్లోకం
యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ||
యావత్సఞ్జాయతే కిఞ్చిత్సత్త్వం స్థావరజఙ్గమమ్|
క్షేత్రక్షేత్రజ్ఞసంయోగాత్తద్విద్ధి భరతర్షభ||
భావం
నశ్వరములైన చరాచరభూతముల యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు, అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజముగా చూచువాడు.
నశ్వరములైన చరాచరభూతముల యందు సమముగా స్థితుడైయున్న పరమేశ్వరుడు నాశరహితుడు, అట్టి పరమేశ్వరుని చూచువాడే నిజముగా చూచువాడు.
28 వ శ్లోకం
సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి||
సమం సర్వేషు భూతేషు తిష్ఠన్తం పరమేశ్వరమ్|
వినశ్యత్స్వవినశ్యన్తం యః పశ్యతి స పశ్యతి||
భావం
సమస్తప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మాహంతకుడు కాడు అనగా తనను తాను నాశము చేసికొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందుచున్నాడు.
సమస్తప్రాణులయందును సమభావముతో నుండు పరమేశ్వరుని సమత్వభావముతో చూచువాడు ఆత్మాహంతకుడు కాడు అనగా తనను తాను నాశము చేసికొనువాడు కాడు. అందువలన అతడు పరమగతిని పొందుచున్నాడు.
29 వ శ్లోకం
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్||
సమం పశ్యన్హి సర్వత్ర సమవస్థితమీశ్వరమ్|
న హినస్త్యాత్మనాత్మానం తతో యాతి పరాం గతిమ్||
భావం
సకలకర్మలు అన్ని విధములుగ ప్రకృతిద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు నిజముగ చూచువాడు.
సకలకర్మలు అన్ని విధములుగ ప్రకృతిద్వారానే జరుగుచున్నవనియు, ఆత్మ అకర్త అనియు ఎరింగినవాడు నిజముగ చూచువాడు.
30 వ శ్లోకం
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి||
ప్రకృత్యైవ చ కర్మాణి క్రియమాణాని సర్వశః|
యః పశ్యతి తథాత్మానమకర్తారం స పశ్యతి||
భావం
వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించు చున్నవనియు, ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు.
వేర్వేరుగా గోచరించుచున్న ప్రాణులన్నియును ఒకే పరమాత్మయందు స్థితమై యున్నవనియు, అట్లే అవి యన్నియును ఆ పరమాత్మ నుండియే విస్తరించు చున్నవనియు, ఎరింగిన పురుషుడు ఆ క్షణముననే పరబ్రహ్మను పొందుచున్నాడు.
31 వ శ్లోకం
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా||
యదా భూతపృథగ్భావమేకస్థమనుపశ్యతి|
తత ఏవ చ విస్తారం బ్రహ్మ సమ్పద్యతే తదా||
భావం
ఓ అర్జునా ! నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటి కిని అనాది అగుటవలనను, నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలచే అంటబడడు.
ఓ అర్జునా ! నాశరహితుడైన పరమాత్ముడు ప్రాణుల శరీరములందున్నప్పటి కిని అనాది అగుటవలనను, నిర్గుణుడు అగుటవలనను ఎట్టి కర్మలకును కర్తకాడు. కనుక కర్మలచే అంటబడడు.
32 వ శ్లోకం
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోऽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే||
అనాదిత్వాన్నిర్గుణత్వాత్పరమాత్మాయమవ్యయః|
శరీరస్థోऽపి కౌన్తేయ న కరోతి న లిప్యతే||
భావం
సర్వత్ర వ్యాపించుయున్న ఆకాశము సూక్ష్మ మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమైయున్నను ఆత్మ నిర్గుణమగుటవలన వాటి గుణదోషములును దానికంటవు.
సర్వత్ర వ్యాపించుయున్న ఆకాశము సూక్ష్మ మగుట వలన వాటి గుణదోషములు దానికి అంటవు. అట్లే సకల ప్రాణుల దేహముల యందు స్థితమైయున్నను ఆత్మ నిర్గుణమగుటవలన వాటి గుణదోషములును దానికంటవు.
33 వ శ్లోకం
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే||
యథా సర్వగతం సౌక్ష్మ్యాదాకాశం నోపలిప్యతే|
సర్వత్రావస్థితో దేహే తథాత్మా నోపలిప్యతే||
భావం
అర్జునా ! ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశిత మొనర్చుచున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణులయందును స్థితమై, వాటినన్నింటిని ప్రకాశింప జేయుచున్నాడు.
అర్జునా ! ఒక్క సూర్యుడే ఈ సమస్త జగత్తును ప్రకాశిత మొనర్చుచున్నట్లు, ఒకే ఆత్మ సర్వప్రాణులయందును స్థితమై, వాటినన్నింటిని ప్రకాశింప జేయుచున్నాడు.
34 వ శ్లోకం
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత||
యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః|
క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత||
భావం
ఈ విధముగా క్షేత్ర - క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును, కార్యసహిత ప్రకృతినుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు.
ఈ విధముగా క్షేత్ర - క్షేత్రజ్ఞుల మధ్యగల అంతరమును, కార్యసహిత ప్రకృతినుండి విముక్తులగుటకు ఉపాయములను జ్ఞాననేత్రముల ద్వారా ఎరింగిన మహాత్ములు మోక్షమును పొందుచున్నారు.
No comments:
Post a Comment