భగవద్గీత--అథ నవమోஉధ్యాయః |--రాజవిద్యారాజగుహ్యయోగః
21 నుండి 30 వరకు శ్లోకాలు.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||
భావం:--
ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగ స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహితసకామకర్మలను ఆశ్రయించు వారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే తిరిగి మానవలోకమున జన్మించుచున్నారు.
22 వ శ్లోకం:--
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||
భావం:--
పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారియోగ క్షేమములను నేనే వహించుచుందును.
23 వ శ్లోకం:--
యేஉప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తేஉపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ||
భావం:--
ఓ అర్జునా ! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధి పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.
24 వ శ్లోకం:--
అహం హి సర్వయఙ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ||
భావం:--
ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎరుంగరు. కావున పతనమగు చున్నారు. (పునర్జన్మ పొందుచున్నారు).
25 వ శ్లోకం:--
యాంతి దేవవ్రతా దేవాన్పితూన్యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోஉపి మామ్ ||
భావం:--
దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు.
26 వ శ్లోకం:--
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ||
భావం:--
నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమును గాని, ఫలమును గాని జలమును గాని, నేను ప్రత్యక్షముగా ఆరగింతును.
27 వ శ్లోకం:--
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||
భావం:--
ఓ కౌంతేయా ! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించుదానమును, ఆచరించు తప్పస్సును నాకే సమర్పింపుము.
28 వ శ్లోకం:--
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||
భావం:--
ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మ బంధముల నుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే పొందగలవు.
29 వ శ్లోకం:--
సమోஉహం సర్వభూతేషు న మే ద్వేష్యోஉస్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||
భావం:--
నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారి యందు ఉందును.
30 వ శ్లోకం:--
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||
భావం:--
మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా అతడు సాధువే యని గ్రహింపుము.
21 నుండి 30 వరకు శ్లోకాలు.
తే తం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి |
ఏవం త్రయీధర్మమనుప్రపన్నా గతాగతం కామకామా లభంతే ||
భావం:--
ఆ విశాల స్వర్గమునందు భోగములను అనుభవించి, పుణ్యములు అయిపోగానే (క్షీణింపగానే) మరల మర్త్యలోకమున ప్రవేశింతురు. ఈ విధముగ స్వర్గప్రాప్తి సాధనములైన వేదత్రయవిహితసకామకర్మలను ఆశ్రయించు వారు, భోగములను ఆసించుచూ స్వర్గమర్త్యలోకముల మధ్య రాకపోకలు సాగించుచుందురు. అనగా పుణ్య ప్రభావముచే స్వర్గమునకు పోవుదురు. పుణ్యము క్షీణింపగనే తిరిగి మానవలోకమున జన్మించుచున్నారు.
22 వ శ్లోకం:--
అనన్యాశ్చింతయంతో మాం యే జనాః పర్యుపాసతే |
ఏషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహమ్ ||
భావం:--
పరమేశ్వరుడనైన నన్నే నిరంతరము అనన్య భక్తితో చింతనచేయుచు, నిష్కామ భావముతో సేవించువారియోగ క్షేమములను నేనే వహించుచుందును.
23 వ శ్లోకం:--
యేஉప్యన్యదేవతా భక్తా యజంతే శ్రద్ధయాన్వితాః |
తేஉపి మామేవ కౌంతేయ యజంత్యవిధిపూర్వకమ్ ||
భావం:--
ఓ అర్జునా ! శ్రద్ధాన్వితులైన సకామ భక్తులు ఇతరదేవతలను పూజించినప్పటికిని వారు నన్ను పూజించినట్లే. కాని వారిపూజలు అవిధి పూర్వకములైనవి. అనగా అజ్ఞానముతో కూడినవి.
24 వ శ్లోకం:--
అహం హి సర్వయఙ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ |
న తు మామభిజానంతి తత్త్వేనాతశ్చ్యవంతి తే ||
భావం:--
ఏలనన సకల యజ్ఞములకును భోక్తను, స్వామిని గూడ నేనే. వారు నా పరమేశ్వర తత్త్వమును ఎరుంగరు. కావున పతనమగు చున్నారు. (పునర్జన్మ పొందుచున్నారు).
25 వ శ్లోకం:--
యాంతి దేవవ్రతా దేవాన్పితూన్యాంతి పితృవ్రతాః |
భూతాని యాంతి భూతేజ్యా యాంతి మద్యాజినోஉపి మామ్ ||
భావం:--
దేవతలను పూజించువారు దేవలోకములను చేరుదురు. పితరులను సేవించువారు పితృలోకములకు వెళ్ళుదురు. భూతప్రేతములను అర్చించువారు భూతప్రేత రూపములను పొందుదురు. నన్ను ఆరాధించు భక్తులు నన్నే పొందుదురు.
26 వ శ్లోకం:--
పత్రం పుష్పం ఫలం తోయం యో మే భక్త్యా ప్రయచ్ఛతి |
తదహం భక్త్యుపహృతమశ్నామి ప్రయతాత్మనః ||
భావం:--
నిర్మలబుద్ధితో, నిష్కామభావముతో పరమభక్తునిచే సమర్పింపబడిన పత్రమునుగాని, పుష్పమును గాని, ఫలమును గాని జలమును గాని, నేను ప్రత్యక్షముగా ఆరగింతును.
27 వ శ్లోకం:--
యత్కరోషి యదశ్నాసి యజ్జుహోషి దదాసి యత్ |
యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణమ్ ||
భావం:--
ఓ కౌంతేయా ! నీవు ఆచరించు కర్మను, భుజించెడి ఆహారమును, హోమముచేయు హవ్యమును, అర్పించుదానమును, ఆచరించు తప్పస్సును నాకే సమర్పింపుము.
28 వ శ్లోకం:--
శుభాశుభఫలైరేవం మోక్ష్యసే కర్మబంధనైః |
సంన్యాసయోగయుక్తాత్మా విముక్తో మాముపైష్యసి ||
భావం:--
ఈ విధముగా సన్యాసయోగమునందు స్థిరచిత్తుడవై, అనగా సమస్తకర్మలను భగవంతుడనైన నాకే సమర్పించి, శుభాశుభఫలరూపకర్మ బంధముల నుండి ముక్తుడవయ్యెదవు. పిదప నన్నే పొందగలవు.
29 వ శ్లోకం:--
సమోஉహం సర్వభూతేషు న మే ద్వేష్యోஉస్తి న ప్రియః |
యే భజంతి తు మాం భక్త్యా మయి తే తేషు చాప్యహమ్ ||
భావం:--
నేను సకలభూతముల (ప్రాణుల) యందును సమభావముతో వ్యాపించియుందును. నాకు అప్రియుడు గాని ప్రియుడు గాని ఎవ్వడును లేడు. కాని నన్ను భక్తితో భజించువారు నాయందేయుందురు. నేనును వారి యందు ఉందును.
30 వ శ్లోకం:--
అపి చేత్సుదురాచారో భజతే మామనన్యభాక్ |
సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సః ||
భావం:--
మిక్కిలి దురాచారుడైనను అనన్యభక్తితో నన్ను భజించినచో అతనిని సత్పురుషునిగానే భావింపదగును. ఏలనన యథార్థముగా అతడు నిశ్చయబుద్ధి గలవాడు. అనగా అతడు సాధువే యని గ్రహింపుము.

No comments:
Post a Comment