September 6, 2020

భగవద్గీత ప్రశ్నా వళి -2

 భగవద్గీత ప్రశ్నా వళి -2

1) అర్జునునికి రథం ఎవరు, ఏ సందర్భంలో ఇచ్చారు?

జ ) ఖండవదహనం సమయంలో అగ్నిదేవుడు అర్జునునికి ఇచ్చాడు. 

2) అర్జునునికి దివ్యాశ్వాలు ఎవరు, ఎన్ని బహూకరించారు ?

జ) గంధర్వరాజు అయిన చిత్రరథుడు అర్జునునికి 100 దివ్యాశ్వాలు  బహూకరించాడు. 

3) శ్రీకృష్ణుని శంఖం పేరేమిటి ?

జ) పాంచజన్యం 

4) అర్జునుని శంఖం పేరేమిటి ? ఎవరు ఏ సందర్భంలో ఇచ్చారు ?

జ) శంఖం పేరు దేవదత్తం నివాతకవచులు రాక్షస సంఘంతో పోరాడి గెలిచినప్పుడు దేవేంద్రుడు బహూకరించాడు. 

5) భీముడి శంఖం పేరేమిటి ?

జ) అనంతవిజయం 

6) హృషీకేశః  అంటే అర్థం ఏమిటి ?

జ) ఇంద్రియాలకు అధిపతి 

7) నకుల - సహదేవుల శంఖాల పేర్లేమిటి ?

జ) సుఘోష & మణిపుష్పకాలు 

8) శిఖండికి ఏ రాజు కుమార్తెతో వివాహం జరిగింది ?

జ) హిరణ్యవర్మ కుమార్తెతో 

9) శిఖండికి పురుషత్వాన్ని ఇచ్చిన యక్షుడు ఎవరు ?

జ) స్థూణాకర్ణుడు

10) శంతనుని సోదరుని పేరేమిటి ?

జ) బాహ్లీకుడు    


No comments:

Post a Comment