భగవద్గీత ప్రశ్నా వళి -2
1) అర్జునునికి రథం ఎవరు, ఏ సందర్భంలో ఇచ్చారు?
జ ) ఖండవదహనం సమయంలో అగ్నిదేవుడు అర్జునునికి ఇచ్చాడు.
2) అర్జునునికి దివ్యాశ్వాలు ఎవరు, ఎన్ని బహూకరించారు ?
జ) గంధర్వరాజు అయిన చిత్రరథుడు అర్జునునికి 100 దివ్యాశ్వాలు బహూకరించాడు.
3) శ్రీకృష్ణుని శంఖం పేరేమిటి ?
జ) పాంచజన్యం
4) అర్జునుని శంఖం పేరేమిటి ? ఎవరు ఏ సందర్భంలో ఇచ్చారు ?
జ) శంఖం పేరు దేవదత్తం నివాతకవచులు రాక్షస సంఘంతో పోరాడి గెలిచినప్పుడు దేవేంద్రుడు బహూకరించాడు.
5) భీముడి శంఖం పేరేమిటి ?
జ) అనంతవిజయం
6) హృషీకేశః అంటే అర్థం ఏమిటి ?
జ) ఇంద్రియాలకు అధిపతి
7) నకుల - సహదేవుల శంఖాల పేర్లేమిటి ?
జ) సుఘోష & మణిపుష్పకాలు
8) శిఖండికి ఏ రాజు కుమార్తెతో వివాహం జరిగింది ?
జ) హిరణ్యవర్మ కుమార్తెతో
9) శిఖండికి పురుషత్వాన్ని ఇచ్చిన యక్షుడు ఎవరు ?
జ) స్థూణాకర్ణుడు
10) శంతనుని సోదరుని పేరేమిటి ?
జ) బాహ్లీకుడు
No comments:
Post a Comment